టీడీపీలోకి కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక, రేణుక అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు. అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నా, అభివృద్ధి కోరుకునే వారంతా టీడీపీలోకి రావాలి అని పిలుపునిచ్చిన బుట్టా రేణుక. త్వరలోనే కర్నూల్లో బహిరంగసభ ఏర్పాటుచేసి టీడీపీలో చేరనున్న బుట్టా రేణుక.
ఏరోజు ఉదయం విజయవాడలో చంద్రబాబును కలిసిన కర్నూల్ ఎంపీ. ఈ విధంగా పాదయాత్రకు ముందుగా జగన్ను తెదేపా దెబ్బకొట్టినట్టు అయ్యింది. మరో పక్క అనంతపూర్ అర్బన్ ఎంఎల్ఏ బొడీమళ్ళ గురునాధ్ రెడ్డి, మాజీ కర్నూల్ ఎంఎల్ఏ కొత్తకోట ప్రకాష్ రెడ్డి కూడా తేదేపాలో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం.
ఈ చేరికాలు ఒకదాని తరువాత ఒకటి మొత్తం పాదయాత్ర జరిగే సమయంలో పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ప్రజల దృష్టికూడా పాదయాత్ర మీద కాకుండా ఈ చేరికాల మీదే ఉంటుంది. అలాగే ప్రతి ఒకరు వైకాపా బలహీనపడుతుందనే మాట్లాడుకుంటారు.
#Kurnool @YSRCParty MP #ButtaRenuka joined @JaiTDP infront of Party prez @ncbn.3rd #YSRCP MP joined #TDP #andhrapradesh pic.twitter.com/m0mhgpEza1
— Aashish (@Ashi_IndiaToday) October 17, 2017


