చిరంజీవి పెద్ద కుమార్తె, సుష్మిత తన తండ్రి యొక్క అనేక చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసినందున తెలుగు సినీ ప్రేమికులకు సుపరిచితమైన పేరే. ఆమె ఇటీవల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి, జీ 5 కోసం తన మొదటి ప్రాజెక్ట్ గా వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ వెబ్ సిరీస్ యొక్క రెగ్యులర్ షూటింగ్ గత వారం ప్రారంభమైంది, కాని సిబ్బందిలో ఒకరు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఇప్పుడు షూటింగ్ ఆగిపోయింది. దీనితో మొత్తం తారాగణం మరియు సిబ్బంది ఇప్పుడు హోమ్ ఐసొలేషన్ కు వెళ్ళవలసి వచ్చింది. ఈ వెబ్ సిరీస్కు ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది ఒక పోలీసు మరియు నేరస్థులు పాల్గొన్న నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఆనంద్ రంగా ఒక దశాబ్దం క్రితం సిద్ధార్థ్ మరియు షామిలితో ఓయ్! అనే సినిమాకు దర్శకత్వం వహించారు . ఒక రకంగా చెప్పాలంటే, ఇది అతనికి కమ్ బ్యాక్ మరియు అతని డిజిటల్ అరంగేట్రం. ఈ వెబ్ సిరీస్లో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇటువంటి ఇబ్బందుల కారణంగా టాలీవుడ్ తారలు తమ సినిమాల షూటింగులు పునఃప్రారంభించడానికి వెనుకాడుతున్నారు. కూతురికి జరిగిన ఉదంతంతో చిరంజీవి ఆచార్య షూటింగ్ ప్రారంభించడానికి మరింత వెనుకడుగు వెయ్యవచ్చు. ఎవరన్నా మొదలు పెడితే మిగతా వారు ధైర్యం చేసే అవకాశం ఉన్న తరుణంలో ఇది ఇండస్ట్రీకి ఖచ్చితంగా నిరాశకలిగించే విషయమే.





