రానా పెళ్లికి వచ్చే అందరికీ కరోనా టెస్టు

Rana Daggubati Miheeka Bajaj wedding on 8th augustరానా దగ్గుబాటి మరియు అతని ప్రియురాలు మిహికా బజాజ్ ఆగస్టు 8 న ఒక ఇంటి వారు కానున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ వివాహం సింపుల్ గా చెయ్యబోతున్నారు. ఇంతకుముందు, వారు హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ఫలక్నుమా ప్యాలెస్ ను వివాహ వేదికగా బుక్ చేసుకున్నారు, కానీ అది ఇప్పుడు రామా నాయుడు స్టూడియోకు మార్చబడింది.

ADVERTISEMENT

ఈ వేడుకకు దగ్గరి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మాత్రమే హాజరవుతారు కాబట్టి, ఫలక్నుమా ప్యాలెస్ సరైన ఎంపిక కాదని ఇరు కుటుంబాలు భావించాయి. ఈ వేడుకకు 30 మందికి లోపే అతిథులు హాజరుకానున్నారు. కోవిడ్ -19 ప్రమాదాన్ని తొలగించడానికి స్టూడియోను బయోసెక్యూర్ బబుల్‌గా మారుస్తున్నారు.

అనవసరమైన ఇబ్బందులను నివారించడానికి కొన్ని సన్నిహితులను కూడా ఆహ్వానించలేదు. వేడుకకు హాజరయ్యే ప్రతి వ్యక్తి కరోనా వైరస్ కోసం పరీక్షించబడతారు. రాపిడ్ యాంటీబాడీస్ పరీక్ష జరుపుతారు. ఇది కొన్ని నిమిషాల్లో ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైనా పాజిటివ్‌గా వెల్లడైతే వారికి ఆ విషయాన్ని తెలిపి పెళ్లికి రానివ్వరు.

ఇది ఇలా ఉండగా దగ్గుబాటి హీరోలు… వెంకటేష్, రానాలు వచ్చే ఏడాది మొదటి వరకూ తమ షూటింగులు మొదలు పెట్టకూడదని భావిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన రెండు తెలుగు రాష్ట్రాలలోని తన థియేటర్లు ఇప్పట్లో తేర్చుకోవని సురేష్ బాబు ఇప్పటికే స్పష్టం చేశారు.

ADVERTISEMENT
Latest Stories