గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో చాలావరకూ భారీ విజయాలను అందుకున్నాయి. చాలాకాలం తరువాత మళ్లీ గ్రామీణ నేపథ్యంలో కథను ఇతివృత్తంగా తీసుకుని సుకుమార్ ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నాడు. చరణ్ .. సమంత నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన మొదటి పాటకు అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘రంగా .. రంగా .. రంగస్థలాన ..’ అనే రెండవ సాంగ్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా వదిలారు. అలాగే ఈ సందర్భంగా రిలీజ్ చేసిన దేవిశ్రీప్రసాద్ డప్పు అభిమానులను ఊర్రూతలూగిస్తోంది.
లవ్ .. మర్డర్ మిస్టరీ .. రాజకీయాల నేపథ్యంలో ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు. మార్చి 18వ తేదీన వైజాగ్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక వార్త బయటకు రావాల్సి ఉంది.



