తిరుమలలో అప్పుడు జగన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు అంతే

Pawan-Kalyan-Energy-Levels-Trolled-Big-Timeతిరుమల పుణ్యక్షేత్రంలో అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన వెళ్లే మార్గంలో జై పవన్‌.. జైజై పవన్‌ అంటూ నినాదాలు చేశారు. మరికొందరు ఏకంగా పీఎం పవన్, సీఎం పవన్‌ అంటూ నినాదాలు చేయడం కనిపించింది.

అభిమానుల మితిమీరిన అత్యుత్సాహం భక్తులకు కొంత ఇబ్బంది కలిగించింది. గతంలో విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు తిరుమల వెళ్లినా ఇదే సమస్య. క్షేత్రం పవిత్రతను దెబ్బ తీసేవిధంగా వారి అనుయాయులు, అభిమానులు రాజకీయ నినాదాలు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేవారు.

ADVERTISEMENT

రెండు సందర్భాలలోనూ పార్టీ నాయకులు తమ అభిమానులను కట్టడి చేసే ప్రయత్నం చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం చెందారు. శ్రీవారి దర్శనానంతరం తర్వాత గదిలోనే ఒంటరిగా ధ్యానంలో నిమగ్నమయ్యారని పార్టీ శ్రేణులు తెలిపారు. ఈరోజు తిరుగు ప్రయాణానికి ముందు స్థానిక ఆలయాలు సందర్శించేలా కార్యక్రమాన్ని రూపొందించినట్టు సమాచారం. జాపాలి ఆంజనేయస్వామి ఆలయంతో పాటు అభయాంజనేయస్వామి ఆలయాలను పవన్‌ సందర్శించనున్నారు.

ADVERTISEMENT
Latest Stories