
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టయ్యి దాదాపు ఆరు మాసాలు తీహార్ జైల్లో సేదతీరి వచ్చారు. అయితే జైలు నుంచి వచ్చిన కొంతకాలం పాటు కవిత అటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.
అయితే తాజాగా తిరిగి రాజకీయాలలో యాక్టీవ్ అయ్యారు కవిత. అటు మీడియాలలో ఇంటర్ వ్యూ లు, సోషల్ మీడియాలో రాజకీయ పోస్ట్లు, ఇటు పార్టీ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తూ నిత్యం ఎదో ఒక కారణంతో వార్తలలో నిలుస్తున్నారు కేసీఆర్ కుమార్తె కవిత.
Also Read – వివేకా కేసులో ఇదే తీర్పు ఇచ్చి ఉంటే..
నేడు తెలంగాణలో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్లు చేస్తున్నారు కవిత.
దారి తప్పి వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం, అబద్దపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి నిలువునా ముంచారు, ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసిన ఆరు గ్యారెంటీలు ఎక్కడా.? అంటూ నేరుగా రాహుల్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
Also Read – జగన్ అప్పుడే చెక్ ఇచ్చేశారే… విజయవాడ ఎఫెక్టేనా?
అలాగే మీ ఆశీస్సులతో తెలంగాణ గద్దెనెక్కిన మీ ముఖ్యంమత్రి రేవంత్ రాష్ట్రంలో చేస్తున్న విధ్వంసాన్ని చూసారా.? HCU భూ వివాదంలో అక్కడి విద్యార్థుల పై మీ ప్రభుత్వం విరిచిన లాఠీలకు బదులు చెపుతారా.? ఇప్పటికైనా HCU భూములను సందర్శించి, ఆ విద్యార్థులను పరామర్శించండంటూ కవిత కాంగ్రెస్ హై కమాండ్ కు హై వోల్టాజ్ లో కౌంటర్లు వేస్తున్నారు.
అయితే కవిత ఇప్పుడు పార్టీ పరంగా యాక్టీవ్ గా ఉన్నప్పటికీ బిఆర్ఎస్ ను ఇరుకునపెట్టడానికి, కవిత నోటికి తాళం వేయడానికి ప్రత్యర్థి పార్టీలకు కవిత లిక్కర్ కేసు ఒక్కటి చాలు అన్నట్టుగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. మొన్నీమధ్య కవిత ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో పవన్ ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తిరిగి ఆమెకే భూమ్ రాంగ్ అయిన వైనాలు ఉదాహరణులుగా ఉన్నాయి.
Also Read – వైస్ జగన్ పాదయాత్ర…జగన్ 2.0 చూపిస్తారా.?
ఈ నేపథ్యంలో కవిత ప్రత్యర్థుల మీద చేసే విమర్శలు రాజకీయంగా అంత పెద్ద ప్రభావాన్ని చూపుతాయా.? లేక అవి తిరిగి బిఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడతాయా.? అన్నది చూడాలి.