ఏపీకి కేంద్ర సాయంపై ఏపీ భాజపా అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు మరో 18 పేజీల నోట్ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సంధర్భంగా ఆయన రైల్వే జోన్ పై ఆసక్తికరమైన మాట అన్నారు.
విశాఖకు రైల్వేజోన్పై రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కన్నారు. సహజంగా రాజకీయ నాయకులు ఏదైనా ఏదైనా విషయం పక్కన పెట్టాలంటే వాడే మాట – సరైన సమయంలో సరైన నిర్ణయం. ఒకపక్క మార్చి 5 నుండి మొదలవ్వబోయే బడ్జెట్ సమావేశాలలోపే రైల్వే జోన్ ప్రకటిస్తారని అంతా ఆసక్తిగా వేచిచూస్తున్నారు.
ఈ తరుణంలో ఇలాంటి మాట అన్నారంటే మళ్ళీ మాట మార్చబోతున్నారా? మరోవైపు రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా కాకుండా విజయవాడ కేంద్రంగా తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజానీకం ఆగ్రహంగా ఉంది.



