తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మహాకూటమిలోని భాగస్వాములైన టిడిపి, సిపిఐలతో ఎలాగొలా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండగా, తెలంగాణ జనసమితి మాత్రం కొరకరాని కొయ్యగా మారిందని విశ్లేషణలు వస్తున్నాయి. టిడిపి, సిపిఐలు కొంత పట్టువిడుపులు ప్రదర్శిస్తుండగా కోదండరాంకు చెందిన తెలంగాణ జన సమితి మాత్రం ససేమిరా అంటుందంట.
[m9ad]
టిడిపి ముప్పై సీట్ల నుంచి పదిహేను సీట్లకు తమ డిమాండ్ ను తగ్గించుకోగా, సిపిఐ పది నుంచి ఐదు సీట్లకు పరిమితం అవడానికి సిద్దపడుతోంది. కాని తెలంగాణ జనసమితి మాత్రం ముప్పై ఐదు సీట్లకు పట్టుబడుతోంది. అంతేకాక మహాకూటమి చైర్మన్ గా కోదండరామ్ ను నియమించాలని డిమాండ్ చేస్తోంది
అయితే కోదండరామ్ కు అంత బలం లేదని మూడు,నాలుగు సీట్లు మించి ఇవ్వడం కష్టమని కాంగ్రెస్ వారు అంటున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని పొత్తులుగానీ ఇలా ఆ ఒక్క పార్టీకే 35 సీట్లు అంటే అది అత్మ్యహత్యా సాదృశ్యమే అని కాంగ్రెస్ వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు.



