“భరత్ అనే నేను” రిలీజ్ తర్వాత ప్రకటన?

Mahesh babu, Director Sukumar to team up again‘భరత్‌ అనే నేను’ సినిమా తరువాత, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన మహేష్ బాబు, ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నాలుగేళ్ల క్రితం, తనతో ‘1 నేనొక్కడినే’ వంటి డీసెంట్‌ మూవీని తెరకెక్కించి, ప్రస్తుతం ‘రంగస్థలం’ సూపర్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్న సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడని తెలుస్తోంది.

ADVERTISEMENT

దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించనున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరో వారం లోపు ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. వంశీ పైడిపల్లితో చేసే సినిమాకు దాదాపు సమాంతరంగానే సుకుమార్‌ తో చేయనున్న సినిమా షూటింగ్ ఉంటుందని టాలీవుడ్ అంటోంది. అంటే, సమీప భవిష్యత్తులో మహేశ్‌ రెండు చిత్రాల షూటింగులతో ఫుల్‌ బిజీగా ఉంటాడన్న మాట.

ADVERTISEMENT
Latest Stories