‘బ్లాక్ మనీ’పై మోడీ సర్కార్ మరో స్కెచ్?

Modi Black Money, Narendra Modi Black Money, NArendra Modi Sketch Black Money, Modi Plans  Black Money, Modi Strategy Black Moneyదేశంలో నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు నరేంద్ర మోడీ సర్కారు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 3 లక్షలు మించి జరిగే నగదు లావాదేవీలను నిషేధించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బృందం బ్లాక్ మనీపై సమీక్షించి సిఫార్సులు చేయగా, తాజాగా వాటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. అయితే ఈ ప్రతిపాదనలపై వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం వాణిజ్య, పరిశ్రమ రంగాల్లో 15 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై నిషేధం అమలులో ఉండగా, దీన్ని 3 లక్షలకు తగ్గిస్తే ఆదాయపు పన్ను అధికారుల నుంచి వేధింపులు పెరుగుతాయని వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. నగదు లావాదేవీలన్నీ క్రెడిట్, డెబిట్ కార్డులు, చెక్కులు, డీడీల రూపంలోనే జరపాలన్న లక్ష్యంతోనే 3 లక్షల పరిమితి విధించాలని సిట్ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.

ADVERTISEMENT

ఈ తరహా చెల్లింపులైతే వెంటనే వాటిని ట్రాక్ చేసే వీలు ఇన్ కం టాక్స్ అధికారులకు సులువవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 3 లక్షలు అతి తక్కువ మొత్తమని వ్యాపారులు వాపోతున్నారు. సాధారణ వ్యక్తులకు ఇంత మొత్తాన్ని పరిమితం చేస్తే ఉపయోగం ఉంటుందేమో గానీ, వాణిజ్య రంగానికి అనుసంధానించే విధంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం తిప్పలు తప్పవన్నది నిపుణుల మాట.

ADVERTISEMENT
Latest Stories