జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం టూర్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందరిని ఆశ్చర్యపరుస్తూ మంత్రి పరిటాల సునీత ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సంధర్భంగా ఎదురెళ్లి పవన్ కు స్వాగతం పలికిన పరిటాల శ్రీరామ్, జనసేనానికి బ్రేక్ ఫాస్ట్ గా రాగి ముద్ద , పల్లి చట్నీ ఏర్పాటు చేసిన మంత్రి పరిటాల సునీత
ఆ తరువాత మంత్రితో భేటీ అయ్యారు. అనంతలో కరవుపై అధ్యయనం చేయడానికి మంత్రిగారి సూచనలు, సలహాలు తీసుకుంటా అని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లా సమస్యల్ని అర్ధం చేసుకోవడానికే పరిటాల కుటుంబాన్ని కలిశా అని ఆయన చెప్పుకొచ్చారు. రాయలసీమ సమస్యల గురించి ఒక నివేదిక తాయారు చేయించి ప్రధానికి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదే సమయంలో పరిటాల కుటుంబంతో నాకు ఎటువంటి వివాదాలు లేవు అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ కు పరిటాల రవి గుండుకొట్టించలేదు…గుండుకొట్టించారన్న వార్తల్లో నిజం లేదు అని పరిటాల సునీత తేల్చి చెప్పారు. పవన్ తమ ఇంటికి రావడం సంతోషమని శ్రీరామ్ అన్నారు.
అనంతపూర్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ని కూడా ఆయన కలిసినట్టు తెలుస్తుంది. అనూహ్యంగా జరిగిన ఈ భేటీతో విశ్లేషకులు సైతం విస్తు పోయారు. దీనిని ఏరకంగా చూడాలో అని వారు తికమక పడుతున్నారు. 2019లో పొత్తులకు ఇది సంకేతమా? ఈ సాయంత్రం పుట్టపర్తికి వెళ్లి రేపు ధర్మవరం చేనేత కార్మికులతో భేటీ కానున్న జనసేనాని.



