జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల హడావిడి మొదలుపెట్టారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలలో ఎవరు అబద్దం చెబుతున్నారో నిర్ధారించడానికి ఒక కమిటీ వేశారు. చూడబోతే ఈ కమిటీ రిపోర్టు వచ్చాక బీజేపీ ఇరుకునపడటం ఖాయంగా కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్రానికి చేసే అన్యాయమే వచ్చే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీల ప్రధాన ఎజెండా కాబోతుంది.
దీనిలో భాగంగా వచ్చే కర్ణాటక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మంచిదని ఆయన సన్నిహితులు సలహా ఇస్తున్నారట. జేడీఎస్ నాయకుడు కుమారస్వామితో పవన్ కళ్యాణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలను దూరం పెట్టి జేడీఎస్ కు ప్రచారం చేస్తే మంచిదని అంతా అంటున్నారట.
కర్ణాటకలోని బెంగళూరు, రాయచూరు వంటి చోట్ల తెలుగు వారి ప్రాభల్యం ఎక్కువ. అక్కడ గనుక బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఆ పార్టీ విజయావకాశాలు ఖచ్చితంగా దెబ్బ తింటాయి. అయితే దీనితో మోడీ ఆగ్రహిస్తే వేరే రకంగా ఇబ్బందులు కూడా రావొచ్చు. అటువంటివి అన్ని లెక్కచూసుకుని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వస్తారు.



