సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ మీద ఎప్పుడూ వ్యాఖ్యలు, కామెంట్లతో వివాదాలు సృష్టిస్తుండే దర్శకుడు రాంగోపాల్ వర్మపై పవన్ కల్యాణ్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. “వర్మ ఫ్రస్టేషన్ లో ఉన్నాడని, ఆయన కామెంట్లను విని నవ్వుకుంటానని, వర్మ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని” వ్యాఖ్యానించారు.
ADVERTISEMENT
తన తాజా చిత్రంలో ‘కులం’పై చెప్పిన డైలాగులు కేవలం సినిమా కోసమేనని, అవి తన వ్యక్తిగత అభిప్రాయాలుగా తీసుకోవద్దని కోరాడు. తాను ‘జనసేన’ పార్టీని ప్రకటించిన సమయంలో కాపుల రిజర్వేషన్ అంశం తెరపై లేదని, ఉంటే అప్పుడే తన వైఖరిని బయటపెట్టి ఉండేవాడినని అన్నాడు. దేశానికి మంచి నాయకుడన్న ఒకే కారణంతో మోడీకి మద్దతు పలికానని, ఆ పార్టీలో చేరే ఉద్దేశాలు తనకు ఎన్నడూ లేవని స్పష్టంగా తెలిపారు.
ADVERTISEMENT



