హైందవ ధర్మం ముస్కులో ఎన్ని తప్పులు చేసిన బీజేపీ మద్దత్తు ఇస్తుందేమో. ఇటీవలే లైంగిక వేధింపుల కేసులో జైలుకు పోయిన గజల్ శ్రీనివాస్ కు మంత్రి మాణిక్యాల రావు పూర్తి మద్దత్తు తెలిపారు. గజల్ పై కుట్ర చేసారు. కావాలని ఇరికించారు. నాకు అయిన చిన్నపటి నుండి తెలుసు అని ఆయన కితాబు ఇచ్చారు.
గతంలో జనవరి 1న ఆలయాలలో ప్రత్యేక పూజలు చెయ్యకూడదని ఆయన శాఖ నుండే ఉత్తరువులు వచ్చాయి. వాటిని కూడా ముఖ్యమంత్రికి ఆపాదించి చెడ్డపేరు తెచ్చారు గవర్నమెంట్ కి. మరోవైపు విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయన్న వార్తలు కూడా గవర్నమెంట్ కు చికాకు తెప్పించేవే.
లోకేష్ ని ముఖ్యమంత్రిని చెయ్యడానికే ఆ పూజలు చంద్రబాబు చేయించారు అని రోజా వంటివారు విమర్శలు చేస్తుంటే సంబంధిత శాఖా మంత్రి వాటిని తిప్పికొట్టకుండా చోద్యం చూస్తున్నారు. సహజంగా ఇన్ని వివాదాలు ఒకేసారి వస్తే సంబంధిత శాఖా మంత్రిపై యాక్షన్ తీసుకోవాల్సిందే. బీజేపీతో మైత్రి దెబ్బతింటాదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆయనను ఉపేక్షిస్తున్నారు.



