ఈ ఏడాది సమ్మర్ బొనంజాకు మార్చి 30వ తేదీన విడుదల కానున్న సుకుమార్ – రామ్ చరణ్ ల “రంగస్థలం” తెరలేపుతున్న విషయం తెలిసిందే. చెర్రీ ‘సౌండ్ ఇంజినీర్’గా… అదేలే… చెవిటి వాడిగా కనిపించనున్న ఈ సినిమాలో సమంత మూగమ్మాయిగా నటిస్తుందన్న పుకార్లు గతంలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవి పుకార్లు కాదు, నిజమే అన్న విషయం “రంగస్థలం” తొలి పాట చెప్పకనే చెప్పిందా? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రియులు.
ఈ సినిమాలో తనకు బాగా ఇష్టమైన పాట అంటూ కీర్తించిన సమంత, ఈ పాటలో ఒక్క పలుకు కూడా లేకపోవడం ఇందుకు మరింత బలాన్నిస్తోంది. ఇన్ స్టంట్ హిట్ గా నిలిచిన ‘ఎంత సక్కగున్నావే’ అంటూ సాగిన ఈ పాట అంతా దేవిశ్రీప్రసాద్ స్వరం ఒక్కటే వినిపిస్తుంది. సినిమాలో సమంతపై రామ్ చరణ్ ఆలపించారన్న మాట. సమంతకు ఒక్క పదం కూడా ఇవ్వలేదంటే… ఆమె మూగ క్యారెక్టర్ ను పరోక్షంగా ప్రేక్షకులకు పరిచయం చేయడమే అంటున్నారు నెటిజన్లు. లాజిక్ కరెక్టే కదా..!



