కొన్నేళ్ల క్రితం బిజెపి తరపున ఎన్నికల ప్రచారానికి బయలుదేరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన నాటి అందాల నటి సౌందర్యను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరచిపోలేరు. హీరో జగపతిబాబు, సౌందర్య చాలా సన్నిహితంగా ఉండే వారని, వాళ్లిద్దరి మధ్య ‘ఎఫైర్’ నడుస్తోందనే వదంతులు నాడు గట్టిగానే హల్చల్ చేశాయి. అయితే ఈ విషయంపై స్పందించిన జగపతిబాబు… తాను మహిళలను ప్రేమిస్తానని, అందులో ఎటువంటి అనుమానం లేదన్నాడు.
అయితే తాను ఎప్పుడూ దొడ్డి దోవలో వెళ్లనని, తనది ఎప్పుడూ రాజమార్గమేనని, ఆ విధంగా వెళ్లినప్పుడు తనను అందరూ ఫోకస్ చేశారని చెప్పాడు. సౌందర్య గురించి చెప్పాలంటే… తమ మధ్య ఎఫైర్ లేదంటే ఎవరూ నమ్మరేమోనని, అయితే సౌందర్య, ఆమె సోదరుడు తనకు మంచి మిత్రులని చెప్పారు. తనను వారి కుటుంబ సభ్యుడిలా భావించేవారని, అదే విధంగా, ప్రతి విషయంలోనూ తాను వారి కుటుంబంలో ఒకడిలా ఉన్నానని చెప్పాడు.
ఆమెకు – తనకు ఉన్న సంబంధం పేరును ఒక ఎఫైర్ అని పిలవడం కన్నా… ఓ మంచి స్నేహమని చెప్తే బాగుటుందని, ఎఫైర్ అంటే కేవలం సెక్స్ ఒక్కటే కాదని, అలా ఆలోచించే వాళ్లు కచ్చితంగా మతి భ్రమించిన వాళ్లేనని చెప్పుకొచ్చారు. మగవాళ్లకు మహిళలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా? అని జగపతిబాబు ప్రశ్నించారు. సౌందర్యతో తనకు ఎఫైర్ ఉందని, అయితే ఆ అఫైర్ అందరూ అనుకునేది కాదంటూ జగపతిబాబు స్పష్టం చేశారు.



