సురేష్ బాబు మొత్తం ఇండస్ట్రీనే భయపెట్టేస్తున్నారు

Producer suresh babu clarifies on shootingsషూటింగులకు అనుమతించమని రెండు తెలుగు ప్రభుత్వాలకు ప్రాతినిధ్యాలు ఇచ్చిన తెలుగు చిత్ర ప్రముఖులలో సురేష్ బాబు ఒకరు. ప్రభుత్వాలు అనుమతించినప్పటికీ, మహమ్మారికి భయపడి చాలా చిత్ర యూనిట్లు ఇంకా షూటింగులు ప్రారంభించలేదు. ఇప్పుడే కొంత మంది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో షూటింగ్ ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి.

ADVERTISEMENT

ఈ సమయంలో సురేష్ బాబు ఆశ్చర్యకరంగా షూటింగ్ ప్రారంభించ కూడదని, థియేటర్లను తెరవకూడదని బలంగా వాదిస్తున్నారు.
“థియేటర్లలో సినిమాలు చూడటానికి నాకు ధైర్యం లేదు మరియు ఈ మహమ్మారి పరిస్థితిలో కూడా నేను ఎటువంటి షూటింగులను సిఫారసు చేయను. నాకు నష్టాలు వచ్చినా థియేటర్లను తెరవడం ద్వారా ప్రజల జీవితాన్ని ప్రమాదంలో పడేయలేను,” అని సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ఈ సమస్యకు పరిష్కారం లభించే వరకు థియేటర్లను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ తన థియేటర్లు మూసి వేసే ఉంటాయని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. సురేష్ బాబు కింద రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 450 థియేటర్లు ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చేవరకు తాము షూట్ ప్రారంభించబోమని దగ్గుబాటి హీరోలు ఇప్పటికే తమ నిర్మాతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.

సురేష్ బాబు సంగతి ఎలా ఉన్నా ఆయన వ్యాఖ్యలు.. సినిమా మొదలు పెట్టాలని ఆలోచన చేస్తున్న నిర్మాతలను కూడా అయోమయంలో పడేసే ప్రమాదం ఉంది. ఇది ఆకలి దప్పులతో అలమటిస్తున్న సినీ కార్మికుల పాలిట శాపమే. అయితే ప్రస్తుత పరిస్థితి ఎవరినీ తప్పుపట్టలేనిది.

ADVERTISEMENT
Latest Stories