వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతుంది. తాజాగా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు (కన్నబాబు) వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరవచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే యలమంచిలి రవి, వసంత కృష్ణ ప్రసాద్ జాయిన్ అవ్వగా, కన్నా లక్ష్మీనారాయణ, కాటసాని రాంభూపాల్ రెడ్డి వంటి వారు లైన్ లో ఉన్నారు.
అయితే ఈ చేరికల వల్ల టీడీపీలో ఎటువంటి కలవరం కనిపించడం లేదు. “వెళ్తున్న వారంతా మేము టిక్కెట్లు ఇవ్వని వారో లేక అనేక కారణాల వల్ల చంద్రబాబుతో కలిసి పని చెయ్యలేని వారో. వీరే వల్ల మాకు ఎలాంటి నష్టం లేదు. వారు ఎక్కడున్నా గెలవడం కష్టమే,” అని ఒక సీనియర్ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించారు.
అయితే వీళ్ళ రాకపట్ల వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో హర్షం వ్యక్తం అవుతుంది. ఎవరో ఒకరు జాయిన్ అవుతూ ఉంటే పార్టీ బలంగా ఉందనే సంకేతం ప్రజలలోకి వెళ్తుంది. అలాగే చాలా చోట్ల పార్టీకి సరైన అభ్యర్థులు లేకపోవడంతో వారు ఆ లోటుని భర్తీ చేసే అవకాశం ఉందని వారు సంబరపడుతున్నారు.



