మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీ రాజకీయాలకు దూరంగా ఉన్నా రాజకీయ విశ్లేషణలకు దూరం కాలేదు. అడపాదడపా ఆయన ప్రెస్ మీట్లు పెడుతూ తన శత్రువైన చంద్రబాబు పై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో నిన్న ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీదకూడా ఒక చురక అంటించారు.
“టీడీపీ బీజేపీ ఇప్పటికే మిత్రులు. స్పెషల్ స్టేటస్ ఇస్తే బీజేపీకు మద్దత్తు ఇవ్వడానికి సిద్ధం అని జగన్ ప్రకటించేసారు. అంటే బీజేపీకి మన పార్టీకి రాష్ట్రంలో పోటీ లేదన్నమాట. మరోవైపు జనసేన అనే పార్టీ వస్తుంది. ఆయన బలం ఉన్న చోట్లే పోటీ చేస్తా అంటున్నాడు. అసలు పోటీ చేస్తేనే కదా బలం ఎక్కడ ఉందొ ఎక్కడ లేదో తెలియడానికి,” అని ఉండవల్లి చమత్కరించారు.
మరోవైపు జగన్ పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని అరుణ కుమార్ అబిప్రాయపడ్డారు.జగన్ ముఖ్యమంత్రి అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఉండవల్లి అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విషయాలలో విపలం అయ్యారని, విభజన హామీలు నెరవేరలేదని నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.



