ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి రూటే సెపరేటు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా చంద్రబాబుదే తప్పు. సరిగ్గా వానలు పాడకపోయినా చంద్రబాబుదే తప్పు. విచిత్రమేంటంటే అసలు అన్యాయం చేసిన వాళ్ళని కనీసం ఆయన ఖండించరు కూడా. అయితే నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఆయన రెండు నాలుకల ధోరణికి అద్దం పడుతుంది.
ఎంఆర్పీఎస్ నేతలు కొందరు నిన్న జగన్ ను తన పాదయాత్రలో కలిసి ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణకి మద్దతు ఇవ్వండి అని ఆయనను కోరారు. అయితే ఆయన వారికి అలంటి హామీ ఏమి ఇవ్వకపోగా, అయినా అది కేంద్రం పరిధిలోని అంశం అంటూ పక్కకి జరిగే ప్రయత్నం చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దత్తు ఇస్తే తనకు సపోర్ట్ గా ఉన్న మాలలు దూరం అవుతారని జగన్ భయం.
నిజమే ఎస్సీ వర్గీకరణ అనేది కేంద్రం పరిధిలోని అంశమే. మరి అదేవిధంగా కాపు రిజర్వేషన్లు, విభజన బిల్లు వాగ్ధానాలూ మాత్రం చంద్రబాబు చేతిలో పనులు అన్నట్టుగా రోజు ఆయనను నిందించడం ఏమిటో? అది కూడా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా. నీకు ఓ రూల్… బాబుకో రూల్ తప్పుకాదా?



