కొన్ని నియోజకవర్గాలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. సాధారణ ఎన్నికలు దగ్గరడుతున్న కొద్దీ ముఖ్యనేతల మధ్య దూరం పెరుగుతూనే ఉంది.అదే ఇప్పుడు కేడర్లో అయోమయానికి దారితీస్తోంది. ఐక్యత లోపిస్తోంది. అందుకు బీజం అధిష్టానమే వేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
[m9ad]
ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను మారుస్తూ వస్తోంది. అంతే తప్ప నాయకుల మధ్య ఐక్యతకు ప్రయత్నాలు చేయలేదు. కొన్ని నియోజకవర్గాలలో అయితే ఆశావహుల మధ్య పోటీ పెట్టి వారితో పార్టీ ఖర్చు పెట్టిస్తుందని ఆ పార్టీ వారే ఆరోపిస్తున్నారు. ఈ పని ఇప్పటికి బాగానే ఉన్నా తరువాతి కాలంలో పార్టీని బాగా ఇబ్బంది పెడుతుందని వారు భయపడుతున్నారు.
టిక్కెట్టు రాని వారు పార్టీ కోసం పని చెయ్యడం అటుంచి పార్టీ అభ్యర్ధికి వ్యతిరేకంగా పని చేస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచన జగన్ కు లేకపోవడం విచిత్రం అని వారు అంటున్నారు. గతంలో ఇటువంటి తప్పులే చేసి 2014లో ప్రతిపక్షంలో కూర్చున్నామని ఇప్పటికి మారకపోతే ఎలా అని వారు గగ్గోలు పెడుతున్నారు.



