నరసరావుపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ తిరుమలకు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. అలాగే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవడం తధ్యమన్నారు గోపిరెడ్డి.
ఈ రకంగా గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి జగన్ కంటే ముందే పాదయాత్ర స్టార్ట్ చేసినట్టు అయ్యింది. మరో వైపు నవంబర్ 2 నుండి జగన్ అన్నొస్తున్నాడు పేరుతో 3500 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. 6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక.
ఈ ప్రక్రియలో ఆయన 120 నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని ఆయన నమ్మకం. 120 నియోజకవర్గాల పాదయాత్ర తరువాత జగన్ 50 నియోజకవర్గాలలో బస్సు యాత్ర చెయ్యనున్నారు. తద్వారా అన్ని నియోజకవర్గాలు కవర్ చెయ్యాలని ఆయన ప్లాన్.


