ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో పోలీసుల తనిఖీలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలే లక్ష్యంగా, వారు నివసించే ఏరియాలలో కాపు కాసి మరీ చలానాలు రాసి, జరిమానాలు విధిస్తున్న వైనం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రవితేజ వంటి అగ్ర తారల కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్నాయని జరిమానాలు విధించిన విషయం తెలిసిందే.
అయితే దీనిపై ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ ఓ ప్రశ్న వేసాడు. ఓ ఎంపీ వెళ్తున్న కారు ఫోటోలను పోస్ట్ చేస్తూ… “ఒక ఎంపీ ఇలా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకుని ప్రయాణం చేయవచ్చా..? అడుగుతున్నాను…” అంటూ చేసిన ట్వీట్ నేరుగా హైదరాబాద్ పోలీసులను తాకింది. సినీ సెలబ్రిటీలకే కాదు, రాజకీయ నాయకులకు కూడా నిబంధనలు వర్తిస్తాయన్న విషయాన్ని బ్రహ్మాజీ కాస్త కామెడీగానే ప్రశ్నించాడు.
రాజకీయ నాయకుల లోటుపాటులను, పోలీసు వర్గాలను సహజంగా ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయరు. అయితే బ్రహ్మాజీ మాత్రం ఒకడుగు ముందుకు వేసి, ఇలా అడగడం ఆహ్వానించదగ్గ విషయమే! మరి హైదరాబాద్ పోలీసుల స్పందన ఎలా ఉంటుందో..?
MP can travel in car with dark glasses..?
Just asking.. pic.twitter.com/TKp7GaPeH1— BRAHMAJI (@actorbrahmaji) June 17, 2016



