ఏపీలో దాదాపుగా ఒకేరోజులో వెయ్యి కేసులు

Corona Cases Increasing At Concerning Levels in Indiaఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా కేసులలో ఆంధ్రప్రదేశ్ మరో భారీ పెరుగుదలను నమోదు చేసింది. గడచిన 24 గంటలలో రాష్ట్రం అత్యధికంగా 998 పాజిటివ్ కేసులను నమోదు చేసింది, వీటిలో 37 ఇతర రాష్ట్రాల ప్రజలు మరియు విదేశీ తిరిగి వచ్చినవారు. మిగిలిన 961 కేసులు స్థానికంగా ఉన్నాయి.

గత 24 గంటల్లో 391 రోగులు డిశ్చార్జ్ అయ్యారు మరియు పద్నాలుగు మరణాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 18,697. అలాగే స్థానిక కేసులను మాత్రమే పరిశీలిస్తే, సంఖ్య 16,102. మరోవైపు… వన్ మిలియన్ పరీక్షల మైలురాయిని దాటిన మూడవ రాష్ట్రంగా రాష్ట్రం నిలిచింది. ఇది మంచి పరిణామం అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT

రాష్ట్రంలో ఇప్పటివరకు 232 మంది మరణించగా, 8,422 మంది డిశ్చార్జ్ కావడంతో 10,043 క్రియాశీల కేసులు ఉన్నాయి. కర్నూలు, కృష్ణ, గుంటూరు, మరియు అనంతపూర్ కరోనా కేసులు ఎక్కువ అవుతున్న మొదటి నాలుగు జిల్లాలు. ఇతర రాష్ట్రాల నుండి 416 మంది విదేశీ తిరిగి వచ్చినవారు మరియు 2,179 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా… కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఈ ఉదయం బులెటిన్) ప్రకారం, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 673,165. అలాగే ఇప్పటివరకు 19,268 మరణాలు సంభవించాయి. ఈరోజు ఒక్కరోజే దాదాపుగా పాతిక వేల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.

ADVERTISEMENT
Latest Stories