AP Liquor Scam

మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలలో కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు పై విస్తృత ప్రచారం జరిగింది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె లిక్కర్ స్కాం లో అరెస్టవ్వడం, ఆ పై ఆరు మాసాల పాటు ఆమె జైలు పాలవ్వడం అక్కడ రాజకీయాలలో పూర్తి ప్రభావం చూపాయి.

అలాగే కవిత మీద వచ్చిన ఆరోపణలు, ఆ పై జరిగిన పరిణామాలు కూడా బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా కుంగతీసిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఏపీలో మరో లిక్కర్ కుంభకోణాన్ని బయటకు తీసింది ఏపీ ప్రభుత్వం.

Also Read – ‘పాకీ’స్తాన్ బుద్దులు…!

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉబ్బడిముబ్బడిగా సాగిన మద్యం కొనుగోళ్లు, అమ్మకాలలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటూ విచారణ చేపట్టిన ప్రభుత్వం ఈ కేసును సీఐడీ కి అప్పగించింది. అయితే ఈ కేసులో కీలక నిందితుడుగా పరిగణించిన రాజ్ కసిరెడ్డి ని అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపడంతో ఈ కేసు విచారణలో అధికారులు వేగం పెంచినట్టయ్యింది.

దీనితో ఈ కేసు తో సంబంధం ఉన్న మరికొంతమందిని సీఐడీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన తరుణంలో వారంతా రిమాండ్ ఉన్నారు. తాజాగా కసిరెడ్డి పీఏ పైలా దిలీప్ దుబాయ్ పారిపోయేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకోగా అక్కడ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Also Read – బ్రహ్మాస్త్రాల ఫ్యాక్టరీ పెట్టేశారుగా!

దిలీప్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆయన సమాచారాన్నిసేకరించిన అధికారులు అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేసి, పక్క ప్లాన్ ప్రకారం ఆయన్ను అదుపులోకి తీసుకుని ఈ రోజు రాత్రికి విజయవాడ తరలిస్తున్నారు.

దిలీప్ వద్ద లిక్కర్ స్కాం కు సంబందించిన మరింత కీలక సమాచారం ఉన్నట్టు సిట్ అధికారుల విచారణ లో తేలడంతో ఈ కేసులో పైలా దిలీప్ అరెస్టు కూడా ఒక కీలక పరిణామంగా చెప్పవచ్చు.

Also Read – మురళీ నాయక్‌కు ఏపీ మంత్రులు ఘన నివాళులు


ఇప్పటికే కసిరెడ్డి ని సీఐడీ కస్టడీకి అప్పగించేందుకు విజయవాడ కోర్ట్ అనుమతిచ్చిన సందర్భంలో ఇప్పుడు ఆయన పీఏ కూడా అరెస్టవడంతో లిక్కర్ స్కాం కు సంబంధించిన మరింత కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు అవకాశం లభించినట్టయ్యింది. మరి ఈ తీగ లాగితే తాడేపల్లి డొంక కదిలిద్దేమో చూడాలి.