జగన్‌ మైండ్ గేమ్స్.. ఇలా ఆడేస్తున్నారు!

AP Assembly Speaker Ayyannapatrudu

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఈరోజు శాసనసభలో ప్రధాన ప్రతిపక్షనాయకుడు హోదా గురించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత మీడియా చేస్తున్న దుష్ప్రచారం గురించి శాసనసభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.

సాధారణంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్పీకర్‌ని ఎన్నుకుంటారు. ఆ తర్వాత నియమ నిబంధనలు, సభా సాంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా? అని స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారు.

ADVERTISEMENT

“జూన్ 21న శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం, అ మర్నాడు అంటే జూన్ 22న స్పీకర్‌ ఎన్నిక జరిగింది. స్పీకర్‌ ఎన్నిక జరుగక ముందే జగన్‌ తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని దుష్ప్రచారం ప్రారంభించేశారు.

ఈ ప్రయత్నంలో భాగంగా హైకోర్టులో ఓ పిటిషన్‌ వేసి దానిని పేర్కొంటూ, హైకోర్టు స్పీకర్‌కి నోటీస్ పంపిందంటూ దుష్ప్రచారం కూడా చేయించారు. స్వయంగా తాను కూడా చేస్తూనే ఉన్నారు.

తద్వారా జగన్‌ హైకోర్టు చెప్పని విషయాలు చెప్పిన్నట్లు అటు హైకోర్టుని, ఇటు ప్రజలను కూడా తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దుష్ప్రచారం గురించి సభ్యులకు, ప్రజలకు తెలియజేయాలనే నేను ఈ రూలింగ్ ద్వారా ఈ విషయాలన్నీ సభాముఖంగా తెలియజేస్తున్నాను,” అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చెప్పారు.

జగన్‌ పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడం భాద్యతారహిత్యమే. పైగా గౌరవనీయ శాసనసభ స్పీకర్‌ పట్ల ఈవిదంగా దుష్ప్రచారం చేస్తుండటం మరో తప్పు. ఈ ప్రయత్నంలో తన కుట్రలను హైకోర్టుకి ఆపాదించడం ఇంకా పెద్ద తప్పు. ఇన్ని తప్పులు చేస్తున్నా జగన్‌ ఇంకా విలువలు, విశ్వసనీయత అంటూ నిసిగ్గుగా నీతులు చెపుతూనే ఉన్నారు. కనుక ఈ విషయాలు ప్రజలకు తెలియజేయడం చాలా మంచి నిర్ణయమే.

ADVERTISEMENT
Latest Stories