గత కొన్ని రోజుల నుండి, మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ అక్కినేని నాగ చైతన్యతో వెబ్-సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో ఆ నివేదికలను ఖండించాడు. అలాగే ప్రస్తుతానికి నాగ చైతన్యతో తన తదుపరి చిత్రంపై తన ఏకాగ్రత ఉందని చెప్పాడు.
“నేను బివిఎస్ రవితో పాటు థాంక్ యూ అనే స్క్రిప్ట్ రాస్తున్నాను. నా ప్రాధాన్యత అంతా నాగ చైతన్యకు చెందిన ఈ ప్రాజెక్ట్ మీదే. ఇప్పటికి, వెబ్-సిరీస్ ఏదీ ప్లాన్ చెయ్యలేదు. అయితే భవిష్యత్తులో సినిమాలతో పాటు ఓటీటీలు కూడా మనుగడ సాగిస్తాయి” అని విక్రమ్ వెల్లడించారు. తన 20 సంవత్సరాల కెరీర్లో విక్రమ్ తాను రాయని కథను దర్శకత్వం వహించడం ఇదే మొదటిసారి.
థాంక్ యూ గురించి మాట్లాడుతూ, “ఇది మెసేజ్-ఓరియెంటెడ్ ఫిల్మ్ కాదు, కానీ అద్భుతమైన ఒక అంశం అంతర్లీనంగా ఉంది. దీనిలో అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ – హాస్యం,డ్రామా, రొమాన్స్ అలాగే కొంచెం యాక్షన్ ఉంటాయి”. ఈ ప్రాజెక్ట్ యొక్క అధికారిక ప్రకటన లాక్డౌన్ తర్వాత జరుగుతుంది. మనం తరువాత విక్రమ్ సరైన హిట్ అందుకోలేదు.
దానితో ఈ సినిమా విజయం సాధించాలని ఆయన పై ఒత్తిడి ఉంటుంది. విక్రమ్ కుమార్ తాజాగా నానితో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. విక్రమ్ మొన్న ఆ మధ్య అఖిల్ తో హలో అనే సినిమా తీశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తమ్ముడితో నిరాశపరచిన ఈ దర్శకుడు అన్నతో నైనా హిట్ కొడతాడేమో చూడాలి.





