CM Revanth Reddy About Telangana Financial Status

రాష్ట్ర విభజన, జగన్‌ 5 ఏళ్ళ విధ్వంస పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిందని అందరికీ తెలుసు.

రాష్ట్ర విభజన, జగన్‌ పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. రెండుసార్లు సిఎం చంద్రబాబు నాయుడే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెడుతున్నారు. జగన్‌ చేసిన అప్పుల భారం మోస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తుండటం మామూలు విషయం కాదు.

Also Read – జగన్‌ నోట అరెస్ట్‌: ఈయనకి ఎవరైనా చెప్పండర్రా!

ఈ నేపధ్యంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తమ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి చెప్పిన మాటలు వింటే దిగ్బ్రాంతి కలుగుతుంది. దాని కంటే ముందు చెప్పుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే దేశంలో ధనిక రాష్ట్రాలలో ఒకటిగా అవిర్భవిస్తుందని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ పదేపదే చెప్పేవారు. ఆయన చెప్పినట్లే రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఎంతగానో లాభపడింది.

Also Read – ట్రంప్ కి కౌంటర్ లేనట్టేనా.?

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ ధనిక రాష్ట్రమని చాలాసార్లు చెప్పారు. తాను రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి సంపద సృష్టించి మరింత ధనిక రాష్ట్రంగా మార్చానని చెప్పేవారు. నేటికీ అదే మాట చెపుతున్నారు కూడా.

కానీ సమ్మెకు సిద్దమవుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సోమవారం చెప్పిన కొన్ని విషయాలు వింటే దిగ్బ్రాంతి కలుగుతుంది.

Also Read – కొడాలి నాని విదేశాలకు జంప్?

రాష్ట్ర విభజనకు మునుపు అంటే సమైక్య రాష్ట్రంలో అప్పులు, వడ్డీలకు ఏడాదికి రూ.7-8,000 కోట్లు చెల్లించేవారు. కానీ ఇప్పుడు నెలకే రూ.7-8,000 కోట్లు చెల్లించవలసి వస్తోంది!

అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తానంటూ కేసీఆర్‌ 11 శాతం వడ్డీతో రూ.50,000 కోట్లు అప్పులు తెచ్చారు. ఆ వడ్డీ భారం భరించలేక తన హయంలోనే హైదరాబాద్‌లో అత్యంత విలువైన భూములు అమ్మేశారు.

నాడు కేసీఆర్‌ అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులు తీర్చడం కోసమే మేము తక్కువ వడ్డీతో రూ.1.58 లక్షల కోట్లు అప్పు తీసుకొని, దానిలో రూ.1.52 లక్షల కోట్లు అప్పులు, వడ్డీలు చెల్లించాము.

తెలంగాణ ధనిక రాష్ట్రం అని కేసీఆర్‌ నేటికీ ప్రజలను మభ్యపెడుతున్నారు. కానీ తెలంగాణ ఆదాయం నెలకు రూ.18,500 కోట్లుకాగా దానిలో రూ.7-8,000 కోట్లు అప్పులు, వడ్డీలకి, మిగిలిన సొమ్ములో మరో రూ.5-6,000 కోట్లు ఉద్యోగుల జీతాలు, పింఛనులకు పోతోంది. మిగిలిన రూ.5-6,000 కోట్లతోనే ప్రభుత్వ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలు వగైరా కొనసాగించాల్సి వస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే.. మనకి కొత్తగా అప్పు ఇచ్చే నాధుడే కనబడటం లేదు. ఢిల్లీకి వెళితే ఎవరూ మా మొహాలు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. మమ్మల్ని చెప్పులు దొంగిలించుకుపోవడానికి వచ్చినవారన్నట్లు చూస్తున్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే తెలంగాణలో గుంతలు పడిన రోడ్లకు ఇంత తారు పూసేందుకు కూడా ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ ఉండటం లేదు!

అందుకే ఒక్కో నెలలో ఒకొక్కరి జీతాలు పెండింగులో పెట్టి వేరే వారికి ఇవ్వాల్సివస్తోంది. ఈ పరిస్థితిలో టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగులు జీతాల పెంపు కోసం సమ్మె చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ సమ్మె చేసినా జీతాలు పెంచలేము. సమ్మె వల్ల మీరు, ప్రభుత్వం, ప్రజలు అందరూ ఇబ్బంది పడాల్సివస్తుంది,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.




కేసీఆర్‌ హయంలో చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందనేది వాస్తవం. కానీ ఆ అభివృద్ధి పేరుతో చేసిన అప్పుల వలననే నేడు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇంత దయనీయంగా మారడం చాలా శోచనీయం… కదా?