బ్రతికి ఉండగానే తానూ కాలం చేసినట్లుగా జరిగిన ప్రచారాలు కమెడియన్ వేణు మాధవ్ ను ఎంతగా వేధించాయో మరోసారి తన మాటల ద్వారా బయటపెట్టారు. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వేణుమాధవ్ మీడియాతో వ్యాఖ్యానిస్తూ… “బుద్ధి లేని గాడిదలు రాసిన రాతలు” అంటూ తన మరణంపై కధనాలు ప్రచురితం చేసిన వాటిని అభివర్ణించారు.
ఈ ఉదంతంపై ఇప్పటికే కుషాయిగూడ పోలీస్ స్టేషన్, మంత్రి తలసాని యాదవ్ లను కలిసి ఫిర్యాదు చేసిన వేణుమాధవ్ త్వరలో గవర్నర్ నరసింహన్ ను కూడా కలుస్తానని చెప్పారు. ఇప్పటికే వివిధ సందర్భాలలో తన ఆవేదనను వ్యక్తపరిచిన వేణుమాధవ్ ఈ సారి మరింత ఘాటుగా స్పందించారు. చూడబోతుంటే ఈ ఉదంతాన్ని కేవలం ఒక కేసుతోనో, మీడియా హెచ్చరికలతోనో వదిలేలా కనపడడం లేదు.
ADVERTISEMENT
ADVERTISEMENT



