“బుద్ధి లేని గాడిదల రాతలు” అంటూ ధ్వజమెత్తిన వేణు!

Venu Madhav death controversyబ్రతికి ఉండగానే తానూ కాలం చేసినట్లుగా జరిగిన ప్రచారాలు కమెడియన్ వేణు మాధవ్ ను ఎంతగా వేధించాయో మరోసారి తన మాటల ద్వారా బయటపెట్టారు. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వేణుమాధవ్ మీడియాతో వ్యాఖ్యానిస్తూ… “బుద్ధి లేని గాడిదలు రాసిన రాతలు” అంటూ తన మరణంపై కధనాలు ప్రచురితం చేసిన వాటిని అభివర్ణించారు.

ఈ ఉదంతంపై ఇప్పటికే కుషాయిగూడ పోలీస్ స్టేషన్, మంత్రి తలసాని యాదవ్ లను కలిసి ఫిర్యాదు చేసిన వేణుమాధవ్ త్వరలో గవర్నర్ నరసింహన్ ను కూడా కలుస్తానని చెప్పారు. ఇప్పటికే వివిధ సందర్భాలలో తన ఆవేదనను వ్యక్తపరిచిన వేణుమాధవ్ ఈ సారి మరింత ఘాటుగా స్పందించారు. చూడబోతుంటే ఈ ఉదంతాన్ని కేవలం ఒక కేసుతోనో, మీడియా హెచ్చరికలతోనో వదిలేలా కనపడడం లేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories