ED Takeovers AP Liquor Scam Case

ఏపీ మద్యం కుంభకోణం కేసు ఈడీ చేతిలోకి వెళ్ళబోతోంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ వద్ద గల సమస్త సమాచారం ఇవ్వాలని కోరుతూ ఈడీ లేఖ వ్రాసింది. అలాగే ఈ కేసులో సీఐడీ (సిట్) పేర్కొన్న నిందితులను, జైల్లో ఉన్న నిందితులను విచారించేందుకు అనుమతి కోరింది.

సిట్ ఛార్జ్-షీట్‌లో పలువురు నిందితులను పేర్కొని అందరూ కలిసి మద్యం ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలు, వసూళ్ళ ప్రక్రియలో వేలకోట్లు అవినీతికి పాల్పడ్డారని, కమీషన్ల రూపంలో వచ్చిన ఆ సొమ్ముణి సూట్ కేసు కంపెనీలలోకి మళ్ళించి, ఎవరికీ అనుమానం కలుగకుండా వాటి నుంచి ఆ సొమ్ముని అంచెలంచెలుగా తాడేపల్లి ప్యాలస్‌కు చేర్చారని సిట్ ఆరోపిస్తోంది.

Also Read – ఇంటర్వెల్ అదుర్స్.. మరి క్లైమాక్స్..?

ఈ కేసులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాధమిక ఆధారాలున్నాయి కనుక, తమని విచారణకు అనుమతించి, సంబంధిత నివేదికలు, డాక్యుమెంట్లు, ఆర్ధిక లావాదేవీలకు సంబందించిన పత్రాలు తమకు అందించాలని ఈడీ కోరింది.

ఈ కేసులో ఉన్నవారందరూ దాదాపు వైసీపీకి చెందినవారే. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. కనుక వారిపై మద్యం కుంభకోణంలో కేసులు నమోదు చేస్తే రాజకీయ కక్ష సాధింపులని కూటమి ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారు.

Also Read – కాకాణి, క్వార్జ్ రెండూ చాలా విలువైనవే.. దొరకడం కష్టమే!

కనుక ఈ కేసుని ఈడీకి అప్పగించాలనుకుంటున్నామని ఇది వరకే సిఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో చెప్పారు. బహుశః అందువల్లే ఈడీ ముందుకు వచ్చి ఉంటుంది.

కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఈ కేసు కేంద్ర ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే ఈడీ చేతిలోకి వెళితే టీడీపీ, వైసీపీలకు లాభామా నష్టమా?అని ఆలోచిస్తే రెంటికీ లాభమే అని చెప్పవచ్చు.

Also Read – జయహో ఆంధ్రప్రదేశ్‌.. ఇక అన్ని మంచి రోజులే!

అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులతోనే 5-12 ఏళ్ళుగా ఫుట్‌బాల్ ఆడేసుకొంటున్న వైసీపీ నేతలకి ఈ కేసుతో ఆడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇంత పరపతి, ఇంత శక్తివంతమైన వైసీపీ నేతలున్న ఈ కేసుని ఏపీ సీఐడీ స్థాయిలో పరిష్కరించడం చాలా కష్టమే. ఈ కేసులో దోషులకు శిక్షలు పడేలా చేయడం చాలా కష్టమే. కానీ వారు ప్రయత్నించక తప్పదు. ప్రయత్నిస్తున్న కొద్దీ వైసీపీ చేసే విమర్శలు, ఎదురుదాడితో టీడీపీకి రాజకీయంగా ఎంతోకొంత నష్టం జరుగుతుంది.

కనుక ఈడీ చేతికి ఈ కేసుని అప్పగించేస్తే ఇక వైసీపీ నేతలు సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని నిందించలేరు. నిందిస్తూ రాజకీయ మైలేజ్ పొందలేరు.

ఇక వైసీపీ విషయానికి వస్తే, ఈ కేసు సీఐడీ చేతులలో ఉండటం కంటే ఈడీ చేతిలోకి వెళ్ళడం వలన వారికి అరెస్టుల భయం ఉండదు. ఈడీని ఎలా హ్యాండిల్ చేయాలో వైసీపీ నేతలకు బాగా తెలుసు. కనుక ఈ మద్యం కుంభకోణం కేసు ఈడీ చేతిలోకి వెళిపోతే, ఈ కేసుని కూడా ఓ 5-10 ఏళ్ళు లాగించేస్తూ వైసీపీలో నిందితులు హాయిగా రిలాక్స్ అవవచ్చు.