మొదలయిన మెట్రో పరుగు!

Hyderabad Metro Rail started from miyapur at 6 amఎన్నాళ్లగానో వెచ్చిచూసిన రోజు రానే వచ్చింది. హైదరాబాద్ లో ఈరోజు ఉదయం 6 గంటలకు మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా ఉదయం ఆరు గంటలకు ఒక రైలు నాగోలు స్టేషన్‌లో, మరో రైలు మియాపూర్‌ స్టేషన్‌లో బయల్దేరాయి. మెట్రోలో తొలిరోజు ప్రయాణించేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు.

ADVERTISEMENT

మొదటి రోజు సుమారు లక్షమంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రతి పావుగంటకో రైలు చొప్పున మొత్తం 18 రైళ్లు తిరుగుతాయి. మియాపూర్‌-నాగోలు 27.6 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 24 మెట్రో స్టేషన్లున్నాయి. ఇప్పటివరకు 12000 స్మార్ట్ కార్డులు అమ్ముడుపోయాయి. మరో వైపు మొదటి టిక్కెట్ కొన్న ప్రయాణికుడికి అధికారులు ఒక గిఫ్ట్ ఇచ్చారు.

నాగోల్‌ – మియాపూర్‌ మధ్య 30 కి.మీల దూరంలో 24 స్టేష్లన్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు కేవలం 42 నిమిషాల్లో నాగోల్ నుంచి మియాపూర్‌‌కు చేరుకోవచ్చు. మెట్రో టికెట్ కనిష్ట ధర రూ.10, గరిష్ట టికెట్‌ ధర రూ.60గా నిర్ణయించారు. నిజానికి మియాపూర్‌-నాగోలు మధ్య దూరం 30 కిలోమీటర్లే. కానీ, ఈ రెండు ‘స్టేషన్ల మధ్య ప్రయాణ దూరం’ 27.6 కిలోమీటర్లేనని కావున ఆమేరకే ప్రజల నుండి ఛార్జీలు వసూలు చేయనున్నట్లు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories