ఓ పక్కన జనసేన అధినేత పోరాటయాత్ర ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా, ఇప్పటివరకు ఒక్క చేరిక కూడా లేకపోవడం పార్టీ వర్గాలను నిరుత్సాహపరచడంతో పాటు, రాజకీయంగా నేతలు పవన్ పై ఎంతటి విశ్వాసాన్ని పెట్టుకున్నారో అన్న దానిని సూచిస్తుంది. అలా సైలెంట్ గా ఉన్న జనసేనలోకి తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యలక వేణుగోపాలరావు చేరారు.
విశాఖకు చెందిన వేణు, జనసేన అధినేత పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. టీమిండియా తరపున 16 వన్డేలు ఆడిన వేణు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ కొన్నాళ్ళు ఆడారు. ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా గడుపుతోన్న వేణు, తన రాజకీయ ప్రస్థానానికి జనసేనను ఎంపిక చేసుకోవడం విశేషం. వేణు చేరిన ఈ సందర్బంలో… 2019లో తమదే అధికారం అంటూ పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా మాట్లాడారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



