సావిత్రి బయోపిక్ గా ఇటీవల వచ్చిన ‘మహానటి’ చిత్రం కథానాయిక కీర్తి సురేశ్ కి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. అలనాటి సావిత్రిని అనుకరిస్తూ ఆమె చూపిన అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నటిగా ఆమెను ఆ చిత్రం ఎంతో ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ మరోసారి సావిత్రిగా కనిపించనుందంటూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ కధనం ప్రచురించింది.
ADVERTISEMENT
ఎన్టీఆర్ జీవితకథగా తెరకెక్కుతున్న బయోపిక్ లో కీర్తి సురేశ్ మళ్లీ సావిత్రి పాత్రను పోషించనుందనేది ఈ కధనం సారాంశం. ఎన్టీఆర్ తో కలసి సావిత్రి పలు హిట్ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రస్తావన కూడా వస్తుందట. ఆయా సందర్భాలలో కనిపించే సావిత్రి పాత్ర కోసం కీర్తిని అడిగినట్టు, ఆమె వెంటనే అంగీకరించినట్టు సమాచారం.
ADVERTISEMENT



