Narendra Modi Emergency Meeting With CCS

మరికొద్ది సేపటిలో ప్రధాని మోడీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్‌లైన్‌ సెక్యూరిటీ (సిసిఎస్)సమావేశం జరుగబోతోంది. దాని తర్వాత వెంటనే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ సమావేశం (సీసీపీఏ)జరుగబోతోంది.

సాధారణంగా జాతీయ భద్రతకు సంబందించిన అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు సిసిఎస్ సమావేశం నిర్వహిస్తుంటారు. గతంలో పూల్వామా దాడి తదనంతర పరిణామాలపై చర్చించి, పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్ చేసే ముందు ఈ కీలక సమావేశం జరిగింది. ఇప్పుడు పహల్గాం దాడి ఘటనపై చర్చించి పాకిస్థాన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవాలో, వాటి పరిధి ఎంతవరకు ఉండాలో ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

Also Read – ఈ పెద్దాయన అమృతం తాగారా.. ఏంటా దూకుడు?

సిసిఎస్‌లో చర్చించి ఆమోదించిన నిర్ణయాలపై మోడీ ప్రభుత్వంలో ‘సూపర్ క్యాబినెట్’గా పిలువబడే సీసీపీఏలో ఆర్ధిక, రాజకీయ కోణంలో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.

ఈ సమావేశంలో ఆమోదం లభిస్తే దానిని అమలుచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే. గతంలో ఈ సమావేశం జరిగిన కొన్ని రోజులకు పూర్తిగా పాక్ భూభాగంపై భారత్‌ వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసింది.

Also Read – నందిగం సురేష్ బయట కంటే లోపలే హ్యాపీ?

ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలతో పాటు దేశంలో ప్రతిపక్షాలలో చాలా పార్టీలు పాకిస్థాన్‌కి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి. కనుక నేడు జరుగబోయే ఈ రెండు కీలక సమావేశాలలో పాకిస్థాన్‌పై దాడికి ఆమోదం లాంఛనప్రాయమే అని భావించవచ్చు.

పాకిస్థాన్‌ కూడా 24-36 గంటల లోపుగా భారత్‌ తమపై దాడి చేస్తుందని చెపుతోంది కూడా! భారత్‌ సైన్యానికి పూర్తి స్వేచ్చనిస్తున్నామని ప్రధాని మోడీ నిన్ననే చెప్పేశారు. కనుక ఈరోజు ఈ రెండు సమావేశాలు ముగిసినప్పటి నుంచి ఏ క్షణంలోనైనా ఏదైనా జరుగవచ్చు.

Also Read – కొడాలి నానిని జగన్‌ పరామర్శించకపోయినా పోలీసులు..