టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా నేడు విడుదల చేసింది. ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం రెవీల్ చేసింది. అంతేకాకుండా, ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు ‘సాక్షి’ అని తెలియజెప్పేలా .. పోస్టర్పై ‘‘సాక్షి’ ఏ మ్యూట్ ఆర్టిస్ట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. షార్ట్ హెయిర్ తో అనుష్క ఈ పోస్టర్ లో డిఫరెంట్ గా కనిపిస్తుంది.
నిశ్శబ్దం” సినిమా షూటింగ్ ఇటీవల యూఎస్ లో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద ద్రుష్టి పెడుతుంది. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడసన్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్ కార్మొరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
తెలుగుతో పాటు తమిళ్ – హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కించారు. అయితే ఇప్పటికే చాలా సినిమాలు క్రిస్మస్ కు వస్తుండడంతో చివరికి ఏమవుతుందో చూడాలి. సౌత్ లో ఇప్పటికే అనుష్కకు మంచి క్రేజ్ ఉంది కాబ్బటి హిందీలో ఈ సినిమా ప్రమోషన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేయాలనీ డిసైడ్ అయ్యారట. బాహుబలి లో దేవసేనగా అదరగొట్టిన అనుష్క ఆ తరువాత కేవలం ఒకే ఒక్క సినిమాలో భాగమతిగా కనిపించింది. దాంతో అనుష్క నటించిన ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.



