సంచలన నిర్ణయం… తొమ్మిది రోజుల పాటు తిరుమలలో దర్శనాలు రద్దు

No darshan at Tirumala temple for five days in Augustతిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ నుంచి 17 వరకు 9 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనుంది. తిరుమలలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ధర్మకర్తల మండలి తెలిపింది. .

ఈ నిర్ణయం ప్రకారం 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు భక్తుల రాకను నిలిపివేయనున్నారు. మహా సంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే స్వామి వారి ఆలయాన్ని చుట్టుముడుతున్న వివాదాలు కూడా ఈ సంప్రోక్షణతో పోతాయని అంతా భావిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఎన్నో నెలలుగా చాలా మంది భక్తుల వేసుకున్న ప్రణాళికలు మార్చుకోవాల్సి ఉంటుంది. నిత్యం లక్షలాధి మందితో కళకళలాడే తిరుమల బోసిపోనుంది. మరోవైపు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ ప్రవాస భారతీయుడు భారీ మొత్తంలో విరాళం అందజేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారి వివిధ ట్రస్టులకు 13.50 కోట్ల విరాళాన్ని ఆయన సమర్పించారు.

ADVERTISEMENT
Latest Stories