కాంగ్రెస్ కేసు పెట్టింది సరే మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది?

Kanna Lakshmi Narayanaచంద్రబాబు నాయుడిపై అరెస్ట్‌ వారంట్‌ జారీ కావడంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చంద్రబాబుకు నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు.

[m9ad]

ADVERTISEMENT

2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తూ వచ్చారు.. చివరి 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్ల నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారంట్‌ జారీ చేశారని వెల్లడించారు. కేవలం ముద్దాయిలు 22 సార్లు కోర్టుకు వెళ్లకపోవడం వల్లనే వారెంట్‌ వచ్చిందని తెలిపారు. సాధారణంగా 3 సార్లు ముద్దాయిలు కోర్టుకు వెళ్లకపోతే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ వస్తుందని వివరించారు.

ఇప్పుడు కొత్తగా నోటీసుల వెనక మోదీ ఉన్నారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మీద కేసు కాంగ్రెస్‌ హయాంలో పెట్టిందని గుర్తు చేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో కేసులు అన్ని ఉపసంహరిస్తున్నామని శాసనసభలో ప్రకటించిన మాట నిజం కాదా? ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ కేసులను ఎందుకు తిరగతోడుతున్నటు? సహజంగా ఇటువంటి కేసులను ప్రభుత్వం ఎత్తి వేస్తుంది కదా?

ADVERTISEMENT
Latest Stories