pakistan-defence-minister-khawaja-asif-on-using-nuclear-weapon

పహల్గాం దాడి తర్వాత పాక్‌పై భారత్‌ ఆంక్షలు విధిస్తున్నప్పుడే పాక్‌ పాలకులు భారత్‌పై అణుబాంబులు ప్రయోగించడానికి వెనకాడబోమని బెదిరించారు. ఇప్పుడు భారత్‌-పాక్‌ మద్య నిజంగానే యుద్ధం జరుగుతోంది. కనుక పాక్‌ పాలకులు భారత్‌పై అణ్వాయుధ ప్రయోగానికి ఆలోచనలు చేస్తుంటే ఆశ్చర్యం లేదు.

పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసీఫ్ ‘జియో న్యూస్’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “అణ్వస్త్ర ప్రయోగం గురించి ప్రస్తుతం మేము ఆలోచించడం లేదు. కానీ ఇదేవిదంగా భారత్‌ మాపై దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తుంటే, వాటిని నియంత్రించేవారు సంయమనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Also Read – జగన్‌, కేసీఆర్‌.. కేసులు… వాటి టైమింగ్ కూడా మ్యాచింగ్!

భారత్‌ మా అవకాశాలను క్రమంగా తగ్గించేసి అణ్వస్త్ర ప్రయోగం గురించి ఆలోచించేలా చేస్తోంది. అణ్వస్త్ర వ్యవస్థని నియంత్రిస్తూ, తుది నిర్ణయాలు తీసుకునే ‘నేషనల్ కమాండ్ ఆధారిటీ’ సమావేశం జరుగలేదు. కానీ జరిగినా జరుగవచ్చు.

భారత్‌ దాడులు కేవలం మా దేశానికే పరిమితమైనవిగా ప్రపంచదేశాలు భావించకూడదు. ఈ యుద్ధం కొనసాగితే అది ప్రపంచ వినాశనానికే దారి తీస్తుందని గ్రహించాలి,” అని అన్నారు.

Also Read – నాన్నకు ప్రేమతో.. కవిత లేఖ.. కొంప ముంచిందే!

అంటే అణ్వస్త్ర ప్రయోగిస్తామని భారత్‌తో సహా ప్రపంచ దేశాలను కూడా పాక్‌ బెదిరిస్తోందన్న మాట! కనుక ప్రపంచ దేశాలన్నీ భారత్‌పై ఒత్తిడి పెంచి యుద్ధం విరమించేలా చేయాలని సూచిస్తున్నారన్న మాట!




పాక్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు, పాక్‌ పాలకులకు ఆలోచనలో పెద్ద తేడా లేదని పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసీఫ్ మాటలే స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి విపరీత ధోరణి కలిగిన పాక్‌ పాలకులకు ఈ యుద్ధ సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చాలా హడావుడిగా, చాలా ఉదారంగా ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు రుణంగా అందిస్తోంది. ఏమనుకోవాలి?

Also Read – అరెస్ట్‌ భయంతోనే జగన్‌ ప్రెస్‌మీట్‌?