పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. ఈరోజు భీమవరంలోని డీఎన్ఆర్ కళాశాల విద్యార్థులు, భీమవరం, ఉంగటూరు, ఉండి నియోజకవర్గాల జన సైనికులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయన మంత్రి నారా లోకేష్ పై మరిన్ని అవినీతి ఆరోపణలు చేశారు.
[m9ad]
“తాను మంత్రి నారా లోకేశ్లా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాలేదని పవన్ అన్నారు. ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ వాళ్లకు కోపం.. మాట్లాడకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిట్టే పరిస్థితుల్లో వచ్చానని గుర్తుచేశారు. మంత్రి లోకేశ్.. ఏ పనికి ఎంతొస్తుంది అన్న స్వార్థంతో పాలసీలు చేస్తున్నారని మండిపడ్డారు,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
గతంలోనూ లోకేష్ పై పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేసారు. అయితే తాను ఆరోపణలు చెయ్యడం లేదని అందరు అంటున్నారు చూసుకోమని మాత్రమే చెప్పానని ఒక్కసారి… లంచాలకు రశీదులు ఇస్తారా అని మరొకసారి పవన్ చెప్పుకొచ్చారు. అయితే ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను ప్రభావితం చెయ్యగలరా?



