
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చాలా తెలివైనవారు కనుకనే రాజధాని అమరావతితో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెడుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులును ప్రధాని మోడీతో చెపుతున్న ‘వికసిత్ భారత్’తో ముడిపెట్టి ముందుకు నడిపిస్తున్నారు. తద్వారా వాటితో ప్రధాని మోడీ కూడా బాగా కనెక్ట్ అయ్యారని అమరావతి పునర్నిర్మాణ సభలో ఆయన ప్రసంగం వింటే అర్దమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజన్లా పనిచేస్తే, వికసిత్ భారత్కు స్వర్ణాంధ్ర గ్రోత్ ఇంజన్లా తోడ్పడుతుందని ప్రధాని మోడీ చెప్పారు. తాను గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఐటి రంగంలో చేస్తున్న అభివృద్ధి గురించి తెలుసుకునే వాడినని అన్నారు.
Also Read – నైజాం పర్సెంటేజ్ లొల్లి… అసలు టార్గెట్ వేరే!
ఎంతో దూరదృష్టి, పట్టుదల గల సిఎం చంద్రబాబు నాయుడు మాత్రమే ఇటువంటి భారీ ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేయగలరని ప్రధాని మోడీ ప్రశంశించారు. అమరావతి నిర్మాణం అత్యవసరమని దాని కోసం తాను అన్ని విదాల సిఎం చంద్రబాబు నాయుడుకి తోడ్పడుతానని హామీ ఇచ్చారు.
ఇప్పుడు ప్రధాని మోడీ- సిఎం చంద్రబాబు నాయుడు మద్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లతో కూడా ప్రధాని మోడీ బాగానే కనెక్ట్ అయ్యారు. కేంద్రానికి చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు ఇస్తుండగా ప్రధాని మోడీ ఆంధ్రా అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
Also Read – ప్రతిపక్షాలతో కూడా యుద్ధం తప్పడం లేదుగా!
జగన్ అమరావతిని నాశనం చేస్తున్నప్పుడు మౌనంగా చూస్తూ ఉండిపోవడం తప్పే అని బహుశః ప్రధాని మోడీ గ్రహించే ఉంటారు. కనుక ఆ పాపం కడిగేసుకునేందుకు ఇప్పుడు అమరావతి నిర్మాణానికి అన్ని విదాల తోడ్పడటం ఖాయమే అని భావించవచ్చు.
ఏపీలో బీజేపి సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే విషయం ప్రధాని మోడీకి, బీజేపి పెద్దలకి తెలియదనుకోలేము. సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాగూ బీజేపి ఉంది కనుక అంతటితో తృప్తి పడుతూ, బీజేపి అధికారంలోకి వచ్చే అవకాశమున్న తెలంగాణ రాష్ట్రంపై మోడీ, అమిత్ షాలు దృష్టి సారించవచ్చు. కనుక బీజేపి లేదా కేంద్రం ఏపీ రాజకీయాలలో వేలుపెట్టే ప్రయత్నం చేయదు.
Also Read – రాత్రి 8 గంటలకు మోడీ…
ఇక మిగిలింది ‘వైసీపీ వైరస్.’ దీనికి సిఎం చంద్రబాబు నాయుడు సరైన వాక్సిన్ వేయగలిగితే చాలు… ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో దూసుకుపోగలదు. నిన్న సభ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని ప్రతీ ఒక్కరికీ నమ్మకం కలుగుతోంది.