Raj Kasireddy in custody

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కర్త, ఖర్మ, క్రియ అయిన కసిరెడ్డి రాజ్‌ని వారం రోజులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేందుకు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు అనుమతించడంతో, సిట్ అధికారులు శుక్రవారం ఉదయం ఆయనని విజయవాడ జైలు నుంచి తమ అధీనంలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇటువంటి కేసులలో నిందితులను ఏవిదంగా విచారణ జరపాలో పోలీసులకు తెలిసి ఉన్నట్లే, ఇటువంటి కేసులను ఏవిదంగా ఎదుర్కోవాలో రాజ్ కసిరెడ్డికి కూడా బాగా తెలుసు. ఎందువల్లనంటే ఆయన లక్షల రూపాయల ఫీజు చెల్లించి సమర్ధులైన న్యాయవాదులను నియమించుకోగలరు కనుక.. అని అనుకోనవసరం లేదు

Also Read – నందిగం సురేష్ బయట కంటే లోపలే హ్యాపీ?

అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి కొన్ని ఫార్ములాలు, నమూనాలు సృష్టించి పెట్టారు.

ఉదాహరణకు వివేకా హత్య కేసులో విచారణ జరిపేందుకు వచ్చిన సీబీఐ అధికారిపైనే ఎదురు కేసులు పెట్టి ముప్ప తిప్పలు పెట్టారు.

Also Read – భారత్‌ క్షిపణు దాడులు నిజమే: ఒప్పేసుకున్నారు!

రాజ్ కసిరెడ్డి కూడా అదే ఫార్ములాని ఫాలో అయిపోతూ, ఈ కేసులో విచారణ జరుపుతున్న ఏపీ సీఐడీ పోలీసులకు సుప్రీంకోర్టు చేత నోటీస్ జారీ చేయించారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉన్న తనకు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఏపీ సీఐడీ పోలీసులు నోటీస్ ఇచ్చే పరిధి, అధికారం లేదంటూ సుప్రీంకోర్టు రాజ్ కసిరెడ్డి పిటిషన్‌ వేశారు. దానిలో ప్రతివాదులుగా ఏపీ సీఐడీ పోలీసులు (సిట్), ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Also Read – ఉచితం సముచితం కాదు కానీ తప్పదుగా!

కనుక కసిరెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ వాటికి నోటీసులు ఇచ్చి ఈ కేసు తదుపరి విచారణని మే 13కి వాయిదా వేసింది. ఈ మద్యం కుంభకోణం కేసులో




ఈవిదంగా పిల్ల కేసులు పెడుతూ విచారణ ముందుకు సాగనీయకుండా అడ్డుకుంటే, ప్రభుత్వం, పోలీసులు, న్యాయ వ్యవస్థలు కూడా ఏమీ చేయలేవని అక్రమాస్థుల కేసులు, వివేకా హత్య కేసులో నిరూపితమైంది కదా? అందుకే మా పిక్క మీద వెంట్రుక కూడా పీకలేరని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పేశారు. కనుక ఏపీ సీఐడీ పోలీసులు కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నా నేరం నిరూపించి శిక్ష పడేలా చేయగలరా? ఏమో!