కేసీఆర్ ఫామ్హౌసులో కూర్చొని శాసనసభ సమావేశాలలో 22ఏ నిషేదిత భూముల వ్యవహారంపై అద్భుతమైన వ్యూహం రచించి సిఎం రేవంత్ రెడ్డిని శాసనసభ వేదికగా ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టాలని అనుకున్నారు.
కానీ సిఎం రేవంత్ రెడ్డి చేతిలో రెండుసార్లు (శాసనసభ, లోక్సభ ఎన్నికలలో) ఎదురుదెబ్బలు తిని రెండున్నరేళ్ళుగా ఫామ్హౌసులో నుంచి అడుగు బయట పెట్టలేకపోతున్న కేసీఆర్, మళ్ళీ రేవంత్ రెడ్డిని చాలా తక్కువ అంచనా వేశారని స్పష్టమవుతోంది.
కేసీఆర్ కుటుంబం మాత్రమే కాక మైహోం రాజేశ్వరరావు వంటివారికి శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఏకంగా 2,400 ఎకరాలు కట్టబెట్టారనే విషయం సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో బయట పెట్టడంతో కేసీఆర్ & కో కంగుతిన్నారు.
ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా ఓ పది మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా బాగానే భూములు సంపాదించుకున్నారని, వారి భూములపై కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరడంతో, సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు వాస్తవమే అని ఆమె కూడా ధృవీకరించినట్లయింది.
కేసీఆర్ హయంలో అభివృద్ధి పనుల పేరుతో గ్రామాలలో తమ భూములను ఏవిధంగా గుంజుకున్నారో, ఆంధ్రావాళ్ళను బెదిరించి హరీష్ రావు తదితరులు ఏవిధంగా గుంజుకున్నారో బాధిత బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెపుతున్నారు.
చివరికి ఊళ్ళలో నిరుపేదలు సైతం కేసీఆర్ హయంలో ఈ భూదోపిడీ జరగడం నిజమేనని చెపుతుండటం గమనిస్తే, సిఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీపై లక్ష్మీ బాంబు కాదు.. ఏకంగా అణుబాంబు వేసినట్లే అనిపిస్తుంది.
HARISH RAO LAND LOOT
ఆంధ్ర వాళ్ళను బెదిరించి ఆస్తులు రాయించుకున్న హరీష్ రావు – గజ్వేల్ ప్రజలుpic.twitter.com/d2hXCQpZtw https://t.co/xC0TUDQjrH
— Revanth Reddy (@revanthreddy_67) September 16, 2026





