టీడీపీ జగన్ నిర్ణయం తప్పని నిరూపిస్తుందా?

TDP to prove ysrcp mps resignations a mistakeపార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 18 నుంచి ఆగస్టు 10వరకు జరిగే ఈ సెషన్‌లో మొత్తం 18 రోజులు సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లో ట్రిపుల్‌ తలాఖ్‌ బిల్లు, ఇతర వెనకబడిన వర్గాల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుల గురించి చర్చకు వచ్చే అవకాశమున్నట్లు కేంద్రం భావిస్తోంది.

అయితే ఈ సెషన్ ను సజావుగా సాగనిచ్చే అవకాశం లేదు. కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెట్టి ఎలాగైనా చర్చ పెట్టాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉంది. అయితే అవిశ్వాసతీర్మాణానికి ఒప్పుకోవాలి లేకపోతే మొత్తం సెషన్ అంతా పోగొట్టుకోవాలి. కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో చూడాలి మరి.

ADVERTISEMENT

మరోవైపు ఈ పార్లమెంట్ సెషన్ కు వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రాతినిథ్యం ఉండబోవడం లేదు. ఇటీవలే ఆ పార్టీలో మిగిలిన ఐదుగురు నామినేషన్లు ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనితో ఇక ఆ పార్టీకి పార్లమెంట్ సాక్షిగా ఆందోళన చేసే అవకాశం లేదు. టీడీపీ పోరాడి ప్రజలను మెప్పించగల్గితే మాత్రం జగన్ బాధ పడక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories