పవన్ ప్రశ్నకు జగన్ సమాధానం!

Pawan Kalyan and Jagan on new districtsజగన్ కొత్త జిల్లాల ప్రకటనతో విభేదించిన జనసేన పవన్ కళ్యాణ్ గిరిజనుల గోడుని ప్రభుత్వానికి వినిపించారు. పోలవరం నిర్వాసితుల ఆవేదనను ప్రభుత్వం అర్ధం చేసుకొని జిల్లాల విభజన చేసుంటే బాగుండేదని., ఈ ప్రాంతం వారు జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే కనీసం మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వస్తుందని ఆ మాత్రం ఆలోచన లేకుండా విభజన చేస్తే ఎట్లా? అంటూ పవన్, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రభుత్వం వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని., లేని పక్షంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పొరపాటుని సరిదిద్దుతామని అక్కడి ప్రజలకు పవన్ భరోసా కల్పించారు. ఈ పత్రిక ప్రకటన ద్వారా వెలువడిన ‘ప్రశ్న’కు విడుదలైన 24గంటలలోనే ప్రభుత్వం నుండి సమాధానం దొరికింది గిరిజన ప్రాంత ప్రజలకు.

ADVERTISEMENT

మాజీ కాబోతున్న మంత్రి పేర్ని నాని ఈ విషయం పై స్పందించారు. పోలవరం ముంపు ప్రాంతాలైన రంపచోడవరం, చింతూరు వంటి గిరిజన ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు అత్యంత దూరంలో ఉండటం వలన ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ మరో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారని., అయితే ఆ జిల్లా కూడా గిరిజన ప్రాంతంలోనే భాగమవుతుందని ‘సమాధానం’ ఇచ్చారు.

ప్రభుత్వంలో కదలికను తీసుకువచ్చి., ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రతిపక్షాల పాత్ర కీలకం అంటే ఇదేనేమో అంటున్నారు నిర్వాసితులు. అయితే ప్రభుత్వ ఆలోచన సరళిని బట్టి ‘ప్రతిపక్షాల – గెలుపుగా’ దీనిని అభివర్ణిస్తే మాత్రం ‘గిరిజనుల – ఓటమి’ ఖరారైనట్లే భావించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ADVERTISEMENT
Latest Stories