ఏపీలో టీడీపీ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన తేదీ

Andhra Pradesh TDP Office Foundationఇప్పటిదాకా తాత్కాలిక ఆఫీస్ నుండి పని చేస్తున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు సొంత మరియు శాశ్వత భవనం ఏర్పాటు పనిలో ఉంది. ఈ నెల 26న శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఇది వరకే స్థలం ఎంపిక చేశారు. ప్రస్తుతం భవన ప్రణాళికలు, ఆకృతులు సిద్ధమవుతున్నాయి.

ADVERTISEMENT

మొత్తం మూడు భవనాలు సిద్ధం అవుతున్నాయి. పరిపాలన భవనం, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, డార్మెటరీ ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశ మందిరాలు, లైబ్రరీ, కంప్యూటర్‌ కేంద్రం వంటివన్నీ ఉంటాయి. మొత్తం లక్షన్నర చ.అడుగుల వైశాల్యం కలిగిన భవనాలు నిర్మిస్తారు.

మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడే తాత్కాలిక భవనం చూసుకుని గృహప్రవేశం చేసింది. అయితే ఇప్పటికి ఆ పార్టీ కార్యకలాపాలు హైదరాబాద్ లోని జగన్ కు చెందిన లోటస్ పాండ్ నుండే జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో వైకాపా టీడీపీ కంటే బాగా వెనుకబడిపోయింది అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories