ప్రకాశం జిల్లా చీమకుర్తి బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ సభలో బూచేపల్లి వెంకాయమ్మ… జగన్ మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమతోనో లేక జగన్ మోహన్ రెడ్డిని ఆకర్షించడానికో గాని స్టేజి మీద బూచేపల్లి వెంకాయమ్మ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పై ఓ భజన పాట అందుకున్నారు.
ఒకప్పుడు చంద్రబాబు ని భజన బ్యాచ్ అంటూ విమర్శించిన వైనం ఏమైనా జగన్ కు గుర్తొచ్చిందో ఏమో కానీ ఆమెను పాట ఆపమని సంకేతం పంపారు. అయినా ఆమె ‘ఫ్లో’ లో ఆమె పాట పాడడంలో బిజి అయిపోయారు. ఇక చేసేదేమి లేక ముఖ్యమంత్రే నేరుగా రంగ ప్రవేశంచేసి మరి బలవంతం ఆమెను చైర్లో కూర్చోపెట్టారు.
ఈ సంఘటనతో సభలో ఉన్న వారందరు వెంకాయమ్మ ‘ఫ్లో’ కి.., జగన్ ‘ప్లాన్’ కి నవ్వుల తో సందడి చేశారు. ఏదిఏమైనప్పటికీ ఇటువంటి అత్యుత్సహం ఉన్న నేతల వలన కొన్ని కొన్ని సందర్భాలలో అధినాయకులు ఇబ్బంది పడక తప్పదు. కాకపొతే ఇటువంటి సందర్బాలలో అధినేతలు ఎవరిని నొప్పించక.,తానొప్పక సభలో రసాభాస జరగకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిఉంటుంది.



