ఒకే రోజులో కరోనా కాటుకి ఏపీలో పదిమంది బలి

coronavirus deaths in andhra pradeshఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఇప్పట్లో తగ్గేలా లేదు. గడచిన 24 గంటలలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 605 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 39 ఇతర రాష్ట్రాల ప్రజలు మరియు విదేశీ తిరిగి వచ్చినవారు. మిగిలిన 570 కేసులు స్థానికంగా ఉన్నాయి. గత 24 గంటల్లో నూట నలభై ఆరు మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు

అదే సమయంలో భారీగా పది మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 11,489. స్థానిక కేసులను మాత్రమే పరిశీలిస్తే, కౌంట్ 9,353. ఇప్పటివరకు 146 మంది మరణించగా, 5,196 మంది డిశ్చార్జ్ కావడంతో 6,147 క్రియాశీల కేసులు ఉన్నాయి. కర్నూలు, కృష్ణ, గుంటూరు, మరియు అనంతపూర్ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలు.

ADVERTISEMENT

ఈ నాలుగు జిల్లాల నుండే ఐదు వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం కేసులలో…. ఇతర రాష్ట్రాల నుండి 372 మంది విదేశాల నుండి తిరిగి వచ్చినవారు మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వచ్చినవారు 1,764 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా… కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఈ ఉదయం బులెటిన్) ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 490,401. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15,301 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. కరోనా తీవ్రతను తగ్గించేవి గా చెప్పబడుతున్న కొన్ని మందులు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రావడంతో రానున్న రోజులలో రికవరీలు పెరోగొచ్చని భావిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories