ఈసారి ఎన్నికలలో అనంతపురం జిల్లాలో 14 శాసనసభ స్థానాలకు 9 స్థానాలు గెలుచుకోబోతోందని ఆగస్ట్లో చేసిన సర్వేలో తేలింది. గత ఎన్నికలలో వైసీపీ 12 శాసనసభ, 2 ఎంపీ సీట్లు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేయగా ఈసారి టిడిపి క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు సర్వేలో తేలింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తరచూ జిల్లాలో పర్యటిస్తుండటం, టిడిపి యువనేత నారా లోకేష్ జిల్లాలో యువగళం పాదయాత్ర ప్రభావం వలన ప్రజలు టిడిపివైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈసారి టిడిపి తాడిపత్రి, సింగనమల, ఉరవకొండ, కళ్యాణ దుర్గం, రాయదుర్గం, హిందూపురం, పెనుగొండ, రాప్తాడు, కదిరి, పుటపర్తి, మడకశిర నియోజకవర్గాలలో గెలుచుకొంటుందని సర్వే సూచిస్తోంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలువబోతున్నట్లు సర్వే పేర్కొంది. అనంతపురం, గుంతకల్, ధర్మవరం మూడు నియోజకవర్గాలలో మాత్రం వైసీపీ గెలిచే అవకాశం ఉందని తాజా సర్వేలో తేలింది.
తాజా సర్వే నివేదిక ప్రకారం…



