లోకేష్ పాచిక పారినట్లేగా!

Nara-Lokesh-Blue-Media-Jaganఏపీలో ప్రస్తుతం రాజకీయ క్రీడ పతాక స్థాయిలో జరుగుతోంది. అయితే ఇందుకు కేంద్ర బిందువుగా కోర్టులు నిలవడమే కొసమెరుపు. తాజాగా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా, అందులో భాగంగా నేడు జరిగిన విచారణలో జగన్ సర్కార్ కు లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది.

ADVERTISEMENT

ఈ విచారణలో భాగంగా వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్, సీఆర్పీసీ 41ఏ క్రింద నోటీసులు మాత్రమే ఇస్తామని, లోకేష్ ను అరెస్ట్ చేయబోమని, ఒకవేళ విచారణకు సహకరించని పక్షంలో కోర్టు దృష్టికి తీసుకువచ్చిన తర్వాతే అరెస్ట్ చేస్తామని, సెక్షన్ 41ఏ నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని కోర్టుకు ఏజీ హైకోర్టుకు తెలిపారు.

దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14గా ఉన్న నారా లోకేష్ ఊరట లభించినట్లే. అంతేకాకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం ద్వారా జగన్ స్కెచ్ లకు ఓ విధంగా చెక్ పెట్టినట్లయ్యింది. అరెస్ట్ అవకాశమే లేనపుడు ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ ప్రశ్న ఉండదు గనుక, హైకోర్టు ఈ విచారణను ఇక్కడితో ముగించింది.

ADVERTISEMENT
Latest Stories