శ్రీదేవి మరణంలో ట్విస్ట్?

Twist in Sridevi death-శ్రీదేవి మృతి విషయంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన సమాచారం ప్రకారం శ్రీదేవి మరణించిన సమయంలో ఆమె భర్త బోనీకపూర్ కూడా హోటల్లోనే ఉన్నారు. ఆమె మరణించిన విషయాన్ని తొలుత ఆయనే గుర్తించారు. కానీ, ఇప్పడు సంచలన వార్తలు (కొత్త సందేహాలు) వెలుగులోకి వస్తున్నాయి.

ADVERTISEMENT

శ్రీదేవి మృత దేహాన్ని హోటల్ సిబ్బందే మొదట గుర్తించినట్టు సమాచారం. ఆమె చనిపోయినప్పుడు బోనీ కపూర్ ఇండియాలోనే ఉన్నారని చెబుతున్నారు. ఆమె మరణం పట్ల ఆమె కుటుంబ సభ్యుల్లో కూడా పలు సందేహాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె మరణించిన 36 గంటల తర్వాత క్లియరెన్స్ ఇవ్వండంపై సందేహాలు తలెత్తుతున్నాయి.

యావత్ భారత దేశాన్ని కుదిపేసిన ఓ సెలబ్రిటీది సాధారణ మరణం అయినప్పుడు… క్లియరెన్స్ ఇవ్వడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని సందేహ పడుతున్నారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆమె మరణంపై కుటుంబ సభ్యులు స్పందించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories